బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez) ఇవాళ తన బర్త్డే వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ నటికి ఘరానా మోసగాడు సుఖేశ్చంద్రశేఖర్(Sukesh Chandrashekhar) జైలు నుంచి ప్రేమలేఖ రాశారు. తన జీవితంలో జాక్వెలిన్ ఎంతో ప్రత్యేకమో చెప్తూ బర్త్డే విషెస్ తెలిపారు.
ఈ లవ్ లెటర్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుఖేశ్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో జాక్వెలిన్ పేరును కూడా చార్జ్షీట్లో చేర్చారు. కేవలం సరదా కోసమే జాక్వెలిన్ రూ.7.14 కోట్లు ఖర్చుచేసిందని ఈడీ వెల్లడించింది.
ఈ నటి మాత్రం సుఖేశ్ తనను మోసగించాడని తన ఎమోషన్స్తో ఆడుకున్నాడని వాపోయింది. ఇటీవల ఈ కేసులో బెయిల్ పొందిన జాక్వెలిన్ తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టింది.