‘సుశాంత్ కేసులో ఆదిత్య ఠాక్రేను ఇరికించాలని చూస్తున్నారు’

‘సుశాంత్ కేసులో ఆదిత్య ఠాక్రేను ఇరికించాలని చూస్తున్నారు’

ముంబై: రీసెంట్‌గా చనిపోయిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో మహారాష్ట్ర మినిస్టర్ ఆదిత్య ఠాక్రేను ఇరికించాలని చూస్తున్నారని శివ సేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. శివ సేన నాయకత్వంలో ప్రభుత్వం పవర్‌‌లో ఉండటాన్ని విపక్షం జీర్ణించుకోలేక పోతోందని మండిపడ్డారు.

‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుతో ఆదిత్య థాక్రేకు ఏంటి సంబంధం? ఇది చూస్తుంటే.. రాష్ట్రంలో శివసేన నాయకత్వంలోని సర్కార్ అధికారంలో ఉండాన్ని విపక్షం జీర్ణించుకోలేకపోతున్నట్లు కనిపిస్తోంది’ అని రౌత్ చెప్పారు. ఎవరైతే ఈ కేసులో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కొడుకు, మంత్రి, శివసేన యూత్ వింగ్ యువ సేన చీఫ్ అయిన ఆదిత్యను ఇరికించాలని కుట్ర పన్నుతున్నారో వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సుశాంత్ డెత్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంగళవారం ఆదిత్య ఠాక్రే స్పష్టం చేశారు. దీన్ని చెత్త రాజకీయంగా కొట్టిపారేశారు.