భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లాలో సెలవుపై ఇంటికి వచ్చిన కానిస్టేబుల్కరెంట్ షాక్తో మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..కుంటాల మండలం అందకూర్ గ్రామానికి చెందిన బింగి రాజన్నకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. వారిలో పెద్ద కొడుకు అయిన భూమేశ్(26)కు గతేడాది కానిస్టేబుల్ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్లో డ్యూటీ చేస్తున్నాడు. మంగళవారం సెలవు మీద ఇంటికి వచ్చాడు.
బుధవారం ఉదయం కొత్తగా నిర్మించిన ఇంట్లోని వాటర్ట్యాంక్ కు నీళ్లు ఎక్కించేందుకు మోటార్స్విచ్ఆన్ చేసే క్రమంలో భూమేశ్కు కరెంట్షాక్ తగిలింది. ఒక్కసారిగా కుప్పకూలడంతో గమనించిన కుటుంబ సభ్యులు108లో భైంసా ఏరియా హాస్పిటల్కు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. ఎంతో కష్టపడి కానిస్టేబుల్అయిన ఏడాదిలోనే చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా ఇటీవలే భూమేశ్కు పెళ్లి కుదిరింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్రవంతి తెలిపారు.