కరెంట్​ షాక్​తో కానిస్టేబుల్​ మృతి

కరెంట్​ షాక్​తో కానిస్టేబుల్​ మృతి

భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లాలో సెలవుపై ఇంటికి వచ్చిన కానిస్టేబుల్​కరెంట్ షాక్​తో మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..కుంటాల మండలం అందకూర్​ గ్రామానికి చెందిన బింగి రాజన్నకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. వారిలో పెద్ద కొడుకు అయిన భూమేశ్(26)కు గతేడాది కానిస్టేబుల్​ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్​లో డ్యూటీ చేస్తున్నాడు. మంగళవారం సెలవు మీద ఇంటికి వచ్చాడు.

బుధవారం ఉదయం కొత్తగా నిర్మించిన ఇంట్లోని వాటర్​ట్యాంక్ కు నీళ్లు ఎక్కించేందుకు మోటార్​స్విచ్​ఆన్ చేసే క్రమంలో భూమేశ్​కు కరెంట్​షాక్ తగిలింది. ఒక్కసారిగా కుప్పకూలడంతో గమనించిన కుటుంబ సభ్యులు108లో భైంసా ఏరియా హాస్పిటల్​కు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు.  ఎంతో కష్టపడి కానిస్టేబుల్​అయిన ఏడాదిలోనే చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా ఇటీవలే భూమేశ్​కు పెళ్లి కుదిరింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్రవంతి తెలిపారు.