కానిస్టేబుల్ కటాఫ్ మార్కుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలె

కానిస్టేబుల్ కటాఫ్ మార్కుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలె

బీఆర్కే భవన్ ముందు కానిస్టేబుల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పోలీస్ రిక్రూట్మెంట్లో కటాఫ్ మార్కులలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులలో రిజర్వేషన్లు కల్పించి.. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులను విస్మరించారని మండిపడ్డారు.

రిజర్వేషన్ల ప్రకారం 50 మార్కులకు కటాఫ్ పెట్టాలి.. కానీ 60 మార్కులకు పెట్టారన్నారు. ఓపెన్ క్యాటగిరీలో పెట్టడం వల్ల 20 వేల మంది అభ్యర్థులు అన్యాయానికి గురయ్యారని అభ్యర్థులు తెలిపారు. కేంద్రప్రభుత్వం యూపీపీఎస్సీ పరీక్షల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తుందని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీస్ రిక్రూట్మెంట్లో అమలు చేయాలని కోరారు.