భద్రాచలం కేసీఆర్​ రాలే.. అందుకే బీఆర్ఎస్​గెలిచింది!

భద్రాచలం కేసీఆర్​ రాలే..  అందుకే బీఆర్ఎస్​గెలిచింది!

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  భద్రాచలంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభకు కేసీఆర్ ​రావొద్దంటూ పలువురు బీఆర్​ఎస్​ నేతలు మొక్కుకున్నారు. ఇప్పుడు అక్కడ బీఆర్​ఎస్​ గెలవడంతో కేసీఆర్ ​రానందువల్లే ఇది జరిగిందని నియోజకవర్గ నేతలు, ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలకు గానూ భద్రాచలం తప్ప తొమ్మిది నియోజకవర్గాల్లో కేసీఆర్​ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పర్యటించారు.  పినపాక నియోజకవర్గంలో పర్యటించే క్రమంలో భద్రాచలం కూడా కేసీఆర్​ వస్తారని అంతా అనుకున్నారు. తీరా కేసీఆర్​ భద్రాచలం తర్వాత అంటూ పినరపాక నుంచి వెళ్లిపోయారు. చివరికి భద్రాచలం బీఆర్​ఎస్​ అభ్యర్థి కేసీఆర్​కు బదులు కేటీఆర్​ను పిలిపించుకొని రోడ్​ షో నిర్వహించేలా చేసుకున్నారు.