రాజ్యాంగమే దేశ ఐక్యతకు పునాది : సీజేఐ జస్టిస్ గవాయ్

రాజ్యాంగమే దేశ ఐక్యతకు పునాది : సీజేఐ జస్టిస్ గవాయ్

రాజ్యాంగమే దేశ ఐక్యతకు పునాది : సీజేఐ జస్టిస్ గవాయ్

లక్నో: రాజ్యాంగమే దేశ ఐక్యతకు బలమైన పునాది అని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. శనివారం యూపీలోని అలహాబాద్ హైకోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్తగా నిర్మించిన అడ్వకేట్స్ ఛాంబర్ బ్లాక్, మల్టీలెవెల్ పార్కింగ్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

"రాజ్యాంగం రూపొందినప్పుడు కొందరు ఇది చాలా ఫెడరల్ అని, మరికొందరు చాలా ఏకీకృతమని విమర్శించారు. కానీ, రాజ్యాంగం పూర్తిగా సమాఖ్య  లేదా పూర్తిగా ఏకీకృతం కాదని అంబేద్కర్ బదులిచ్చారు. శాంతి, యుద్ధ సమయాల్లో దేశాన్ని ఐక్యంగా, బలంగా ఉంచే రాజ్యాంగాన్ని ఇచ్చామని చెప్పారు. భారత్ ఎల్లప్పుడూ సంక్షోభాల్లో ఐక్యంగా నిలిచింది. ఈ ఘనత రాజ్యాంగానిదే " అని సీజేఐ గవాయ్ వెల్లడించారు.