కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ ​చేయాలి

కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ ​చేయాలి
  • ఓయూలో నల్ల బ్యాడ్జిలతో నిరసన

ఓయూ, వెలుగు: తమను పర్మినెంట్ ​చేయాలని కోరుతూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు సోమవారం ఓయూలో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసనకు దిగారు. ఆర్ట్స్ కాలేజీ వద్ద ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ రెగ్యులరైజ్ చేయాలంటూ నినాదాలు చేశారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఓయూ జేఏసీ చైర్మన్ డాక్టర్ ఎ.పరశురాం మాట్లాడుతూ.. 60 రోజులుగా తాము ఆందోళన చేస్తున్నామని, ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి రెగ్యులరైజేషన్​పై ప్రకటన చేసి వెంటనే ప్రక్రియను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. 

లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ నిరసనలో ఓయూ జేఏసీ కన్వీనర్ డాక్టర్ డి.ధర్మతేజ, కాంట్రాక్ట్​అసిస్టెంట్ ​ప్రొఫెసర్లు జితేందర్ రెడ్డి, శైలజారెడ్డి,  వినితా పాండే, అంబటి శ్రీనివాస్, డి.తిరుపతి, కవితారెడ్డి, విజయ్, శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.