అవినీతి పేరుతో కావాల్సినోళ్లకు కాంట్రాక్టులు

అవినీతి పేరుతో కావాల్సినోళ్లకు కాంట్రాక్టులు

పోలవరం ప్రాజెక్టులో అవినీతి పేరుతో వైఎస్ జగన్ సర్కారు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టిందని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పోలవరంలో అవినీతి జరిగిందని గత రెండేళ్ల నుంచి చెబుతున్న జగన్ అధికారంలోకి వచ్చాక ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. అవినీతి బూచి చూపి పనులు ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. అవినీతిని నిరూపించాకే రివర్స్ టెండరింగ్ కు వెళ్లుంటే బాగుండేదన్నారు. కన్నా ఆధ్వర్యంలోని ఏపీ బీజేపీ నేతల బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. పనులు, నాణ్యతా ప్రమాణాలపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులను అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. పోలవరం త్వరగా పూర్తి కావడమే తమ లక్ష్యమని చెప్పారు. టీడీపీ సర్కారు పోలవరం ప్రాజెక్టును టూరిస్ట్ ప్లేస్ లా, డబ్బులిచ్చే ఏటీఎంలా చూసిందన్నారు.