ప్రియాంక హత్య కేసు నిందితులకు న్యాయ సహాయం చేయొద్దు

ప్రియాంక హత్య కేసు నిందితులకు న్యాయ సహాయం చేయొద్దు

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డిపై అత్యాచారం, హత్య చేసిన దోషులకు ఉరిశిక్ష పడాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలో హత్యకు గురైన ప్రియాంకారెడ్డి కేసుపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ… డీజీపీ నుంచి పూర్తి వివరాలు తెలుసుకుంటానని చెప్పారు. దోషులకు తప్పకుండా శిక్ష పడుతుందన్నారు. సాయం చేస్తామని చెప్పి అత్యాచారం చేసి.. హత్య చేయడం దారుణమన్నారు. ఇలాంటి దోషులకు న్యాయ సహాయం చేయవద్దని.. లాయర్లను కోరుతున్నట్లు విజ్ఞప్తి చేశారు. ప్రియాంకరెడ్డి హత్యపై యావత్ దేశం ఆందోళన, బాధ వ్యక్తం చేస్తోందన్నారు కిషన్ రెడ్డి.