- కొత్తగా ‘వన్ కనెక్షన్ వన్ సిలిండర్’ పాలసీ
- పీఎన్జీ ఉన్నవారు సిలిండర్ సరెండర్ చేయాలని రూల్
- కొత్త కనెక్షన్ల కోసం 4 లక్షల దరఖాస్తులు అన్నీ పెండింగ్లోనే...
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్లో వంట గ్యాస్ కష్టాలు తీరడం లేదు. ఇప్పటికే సిలిండర్కు మరో సిలిండర్కు మధ్య బుకింగ్కు 25 రోజుల గడువు పెట్టిన గ్యాస్కంపెనీలు.. బుక్చేసిన తర్వాత డెలివరీ చేయడానికి వారం నుంచి రెండు వారాలు తీసుకుంటున్నాయి. దీంతో వినియోగదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. దీనికి తోడు కొత్తగా వన్కనెక్షన్వన్సిలిండర్పాలసీ అమలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా పైపుడ్నేచురల్గ్యాస్( పీఎన్జీ) కనెక్షన్ ఉన్నవారు సిలిండర్ కనెక్షన్ వదులుకోవాలి. గ్రేటర్ లో ప్రస్తుతం 30 వేలకు పైగానే పీఎన్జీ కనెక్షన్దారులు ఉండగా, ఇందులో సగం మందికి సిలిండర్కనెక్షన్కూడా ఉంది. ఇప్పుడు వీరంతా అంటే 15 వేల మంది వెంటనే సిలిండర్లను స్వాధీనం చేయాల్సి ఉంటుంది. హైటెక్సిటీ, మాదాపూర్, కొండాపూర్, కూకట్పల్లి, మియాపూర్, జీడిమెట్ల, కొంపల్లి తదితర ప్రాంతాల్లో పీఎన్జీ వినియోగదారులు ఎక్కువగా ఉన్నారు. వీరి నుంచి సిలిండర్లను వెనక్కి తీసుకోవడం ద్వారా పెరుగుతున్న బుకింగ్ల ఒత్తిడిని తట్టుకోవచ్చని ఆయిల్కంపెనీలు భావిస్తున్నాయి.
కొత్త కనెక్షన్లు ఇస్తలేరు
గ్రేటర్లో రోజుకు 5 నుంచి 6 లక్షల వరకు సిలిండర్లు బుక్అవుతుండగా, డెలివరీ మాత్రం లక్షన్నరకు మించడం లేదు. బుకింగ్లు, డెలివరీలో కొనసాగుతున్న ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఆయిల్ కంపెనీలు తాజాగా కొత్త కనెక్షన్ల జారీని పెండింగ్లో పెట్టాయి. అలాగే సింగిల్సిలిండర్ఉన్న వారు రెండో సిలిండర్ కోసం చేసుకుంటున్న దరఖాస్తులను కూడా పెండింగ్లోనే పెడుతున్నారు. ఇలాంటివి దాదాపు 4లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
బ్లాక్ మార్కెట్ సంగతేంటి?
గ్యాస్ డిమాండ్ను ఎదుర్కోవడానికి కంపెనీలు పైన చెప్పిన పొదుపు చర్యలు తీసుకుంటున్నా, బ్లాక్ దందాను మాత్రం అరికట్టలేకపోతున్నాయి. ప్రస్తుతం సిటీలో కమర్షియల్, డొమెస్టిక్సిలిండర్ల దందా యథేచ్ఛగా సాగుతోంది. కొన్ని చోట్ల డైరెక్ట్గా డీలర్లు, మరికొన్ని చోట్ల డెలివరీ బాయ్స్, ఇంకొన్ని చోట్ల ఇద్దరూ కలిసి బ్లాక్మార్కెట్లో అమ్ముకుంటున్నారు.
