మండు వేసవిలో చల్లని బీర్లకు ఫుల్ గిరాకీ

మండు వేసవిలో చల్లని బీర్లకు ఫుల్ గిరాకీ
  •     43 డిగ్రీల టెంపరేచర్​లో అదరగొడుతున్న బీర్ల సేల్స్​ 
  •     ఉమ్మడి జిల్లాలో ఒక్క నెలలోనే పెరిగిన 2 వేల పెట్టెల అమ్మకాలు
  •     సేల్స్ పెరగడంతో బీర్లకు మరింత కొరత 

నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలో పగటిపూట ఉష్ణోగ్రతలు భరించలేక కస్టమర్లు బీర్ల సీసాలు ఖాళీ చేస్తున్నారు. మద్యం ప్రియులు చల్లని బీర్లతో చీర్స్ కొడుతున్నారు. ఆదివారం రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరింది. దీంతో వడగాలులు, ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు కస్టమర్లు బీర్లు తాగేస్తున్నారు. 

గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో అదనంగా 31 వేల పెట్టెలు ఖాళీ చేశారు. ఇప్పటికే లిక్కర్, బీర్ల కంపెనీలు వివిధ రకాల కారణాలతో బీర్లు, లిక్కర్​ఉత్పత్తి బంద్​చేశాయి. సాధారణంగా వేసవిలో బీర్లకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. కానీ, ఈ ఏడాది బీర్లకు కూడా కొరత వచ్చింది. మార్కెట్లో డిమాండ్​కు సరిపడా బీర్లు దొరకడం లేదు. ప్రస్తుత రిపోర్ట్​ ప్రకారం నల్గొండ జిల్లా డిపోలో కింగ్​ఫిషర్ లైట్, స్ట్రాంగ్​బీర్లు తప్ప మిగితా బ్రాండ్లు ఒక్కటి కూడా స్టాక్​లేదు. ప్రస్తుతం వైన్స్​లు, బార్లలో ఉన్న స్టాక్ అంతా సోమవారం నాటికి ఖాళీ కానుంది. 

మళ్లీ కొత్త స్టాక్​వచ్చే వరకు మార్కెట్లో ఒక్క కింగ్​ఫిషర్​బ్రాండ్​మాత్రమే దొరుకుతుందని ఎక్సైజ్​ ఆఫీసర్లు చెబుతున్నారు. కింగ్​ఫిషర్ బీర్లు కూడా నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు కలిపి 29,800 పెట్టెలు అవసరంగా కాగా, డిపోలో ప్రస్తుతం 13,200 పెట్టెలు మాత్రమే అందుబాటులో ఉంది. బడ్వయిజర్, నాక్​ అవుట్, హైవార్డ్స్​వంటి పలు రకాల కంపెనీలకు చెందిన బీర్లు స్టాక్​లేదని చెబుతున్నారు. 

రోజుకు 17 వేల పెట్టెలు ఖాళీ..

ఒకవైపు ఫంక్షన్లు, మరోవైపు ఎండల తీవ్రత కారణంగా బీర్ల గిరాకీ జోరుగా సాగుతోంది. ఒక్క మార్చిలోనే రోజుకు 17,852 పెట్టెలు చొప్పున 30 రో జుల్లో సమారు 5,35,589 పెట్టెలు ఖాళీ చేశారు. గతేడాది మార్చిలో 5, 03,732 పెట్టెలు అమ్ముడు పోగా, ఈసారి అదనంగా 31,857 పెట్టెలు సేల్​అయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 ఎస్​హెచ్​ల పరిధిలో 355 వైన్స్​షాపులు ఉండగా, తుంగతుర్తి, మునుగోడు, ఆలేరు, మో త్కూరు మినహా మిగిలిన అన్ని ఎస్​హెచ్​వోల పరిధిలో బీర్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. లిక్కర్ ​సేల్స్​ మాత్రం భారీగా తగ్గాయి. 

గతేడాది మార్చిలో 2,99, 051 వేల పెట్టెలు అమ్ముడుకాగా, ఈ ఏడాది ఇదే రోజుల్లో 2,8 4,910 పెట్టెలకు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే 14,141 కాటన్ల సేల్స్​తగ్గాయి. లిక్కర్ సేల్స్ తగ్గడంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గింది. 2023 మార్చిలో లిక్కర్​ సేల్స్​ ద్వారా రూ.316.8 0 కోట్లు ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.299.17 కోట్లు వచ్చింది. గతేడాదితో పో లిస్తే రూ.17.63 కోట్ల ఆదాయం పడిపోయింది. 

యాదాద్రి జిల్లాలో లిక్కర్ సేల్స్​ డౌన్..

యాదాద్రి జిల్లాలోనే లిక్కర్​ సేల్స్​ భారీగా పడిపోయాయి. భువనగిరి, ఆలేరు, మోత్కూరు, రామన్నపేట ఎస్​హెచ్​లో పరిధిలోనే 10,247 కార్టన్ల సేల్స్​తగ్గాయి. పార్లమెంట్​ఎన్నికల కోడ్ ను అధికారులు​పక్కాగా అమలు చేయడంతో గ్రామాల్లో బెల్టు షాపులను బంద్ ​చేశారు. గత 45 రోజుల నుంచే బీర్లు షార్టేజ్ అయ్యాయని, ప్రస్తుతం కేఎఫ్​ తప్ప ఇతర ఏ కంపెనీల బ్రాండ్లు డిపోల్లో స్టాక్​ లేదని అధికారులు చెబుతున్నారు.