హైదరాబాద్, వెలుగు: ఫెర్టిలైజర్ తయారీ రంగంలోని హైదరాబాద్కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ డ్రోన్స్ రంగంలో కార్యకలాపాలు నిర్వహించే దక్ష అన్మాన్డ్సిస్టమ్స్లో 51 శాతం వాటా కొనుగోలు చేసింది. దక్ష అన్మాన్డ్ సిస్టమ్స్లో గతంలోనే 18.34 శాతం కొనేసిన కోరమాండల్ తాజాగా మరో 32.68 శాతం వాటా కొంది. తన సబ్సిడరీ కోరమాండల్ టెక్నాలజీ ద్వారా ఈ వాటా కొంటున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2019 లో చెన్నై కేంద్రంగా దక్ష అన్మాన్డ్ సిస్టమ్స్ఏర్పాటయింది.
అగ్రికల్చర్, డిఫెన్స్, సర్వెలెన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ను ఈ కంపెనీ అందిస్తోంది. రిమోట్పైలట్ ట్రెయినింగ్ సర్వీసెస్నూ ఇస్తోంది. ఇప్పటిదాకా 950 మంది పైలట్లకు ట్రెయినింగ్ను దక్ష ఇచ్చింది. అగ్రికల్చర్, సర్వెలెన్స్ అప్లికేషన్స్ కోసం మూడు డ్రోన్లకు డీజీసీఏ నుంచి టైప్ సర్టిఫికెట్స్ను దక్ష పొందింది. దేశంలో ఇవి పొందిన ఏకైక కంపెనీ దక్షనే కావడం విశేషం. పెట్రోల్ ఇంజిన్ బేస్డ్ హైబ్రిడ్ అగ్రి డ్రోన్స్ను అందిస్తున్న ఒకే కంపెనీ ఇదే కావడం విశేషం.