కాగజ్ నగర్ గురుకులంలో నలుగురికి కరోనా

 కాగజ్ నగర్ గురుకులంలో నలుగురికి కరోనా

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ లోని మహాత్మా జ్యోతి బాఫూలే గురుకులంలో నలుగురి స్టూడెంట్స్ కు కరోనా వచ్చినట్టు అధికారులు గురువారం తెలిపారు. వారం కిందట స్టూడెంట్స్ కు జ్వరం, జలుబు ఉండడం తో ఈ నెల 12 న విద్యార్థులను పరీక్షించారు. వారిలో ఆరుగురు స్టూడెంట్స్ కు లక్షణాలు కనిపించడం ర్యాపిడ్ టెస్ట్ లు చేశారు. అనంతరం శాంపిల్స్​ను అర్టీపీసీఆర్ టెస్ట్ కోసం అదిలాబాద్ రిమ్స్ కు పంపించారు . వీటి రిపోర్ట్ లు సోమవారం రాత్రి అందగా.. నలుగురు స్టూడెంట్స్ కు కొవిడ్​ సోకినట్టు తేలింది. వారిని ఇంటికి పంపారు. కాగా, గురుకులం లో మిగిలిన విద్యార్థులకు గత అయిదు రోజులుగా ఎటువంటి సమస్యలు లేదని ఎపపారు.