90 లక్షలు దాటిన కరోనా కేసులు

90 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు 90 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 10,83,397  టెస్టులు చేయగా కొత్తగా 45,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90,04,366 కి చేరింది.  584 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 1,32,162 కు చేరింది. నిన్న మరో 44,807 మంది కోలుకున్నారు. మొత్తం 84,28,410 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 4,43,794 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.