దేశంలో 84 లక్షలు దాటిన కేసులు..77 లక్షలకు పైగా రికవరీ

దేశంలో 84 లక్షలు దాటిన కేసులు..77 లక్షలకు పైగా రికవరీ

దేశంలో కరోనా కేసులు 84 లక్షలు దాటాయి.  నిన్న కొత్తగా 47,638 కేసులు నమోదవ్వగా మరో 670 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా కేసులు 84,11,724 కు చేరగా.. మరణాల సంఖ్య 1,24,985 కు చేరింది. నిన్న ఒక్కరోజే 54,157 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 77,65,966 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 5,20,773 మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో కరోనా ఆక్టివ్ కేసులు 6.19 శాతం, రికవరీ 92.32 శాతం, డెత్ రేటు 1.49 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.