97 లక్షలు దాటిన కరోనా కేసులు

97 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. మరోసారి 30 వేలకు దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 26,567 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 97,03,770కి చేరింది. ఇందులో 3,83,866 కేసులు యాక్టివ్‌ గా ఉండగా, 91,78,946 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న మరో 39,045 మంది కరోనా నుంచి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయ్యారని చెప్పింది. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటి వరకు కరోనా వైరస్ తో 385 మంది మరణించారని తెలిపింది. దీంతో మొత్తం మరణాలు 1,40,958 మంది బాధితులు మహమ్మారి వల్ల మృతిచెందారని తెలిపింది.