కేసులు విపరీతంగా పెరిగే అవకాశం
పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడి
జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచన
హైదరాబాద్, వెలుగు: లాక్డౌన్ సడలింపులతో వచ్చే నెల రోజుల్లో కరోనా పీక్స్కు వెళుతుందని, కేసులు విపరీతంగా పెరుగుతాయని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వృద్ధులు, చిన్నపిల్లలు, ఇతర జబ్బులతో బాధపడే రోగులపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని, వాళ్లంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శనివారం మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ర్టంలోని కేసుల్లో ఎక్కువ కేసులు మర్కజ్ లింకున్నవేనన్నారు. లాక్డౌన్ సడలింపులు, వలస కార్మికులు, ఇతర దేశాల నుంచి వచ్చేవారితో వారం రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు.
బర్త్డేతో 82 మందికి
బోరబండలో ఓ యువకుని ద్వారా 14 మందికి వైరస్ అంటుకుందని శ్రీనివాసరావు చెప్పారు. వనస్థలిపురంలో ఒక బర్త్డే పార్టీ ద్వారా 82 మందికి వైరస్ సోకిందన్నారు. వికారాబాద్ జిల్లాల్లో ఒడి బియ్యం కార్యక్రమం వల్ల ఫ్యామిలీ మొత్తానికి వైరస్ అంటుకుందని చెప్పారు. సర్కార్ పెట్టిన రూల్స్ పాటించి ఉంటే కేసుల తీవ్రత తక్కువగానే ఉండేదన్నారు. కరోనాతో పాటు సీజనల్ వ్యాధులపైనా దృష్టి పెడుతున్నామన్నారు. ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి వారం వారం మందులు, ట్రీట్మెంట్ వివరాలను స్వయంగా పరిశీలిస్తామన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి లక్షన్నర మంది వలస కార్మికులు తిరిగొచ్చారని, అందులో వెయ్యి మందికి టెస్టులు చేయగా 175 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాల్లో 82,313 మంది, మిగిలిన వాళ్లు జీహెచ్ఎంసీ పరిధిలో హోంక్వారంటైన్లో ఉన్నారన్నారు. రాష్ర్టంలో ఇప్పటిదాకా 30 వేల మందికి టెస్టులు చేశామన్నారు. గాంధీ హాస్పిటల్లో 1,500 ఆక్సిజన్ లైన్స్ను సిద్ధంగా ఉంచామని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్రెడ్డి తెలిపారు.
ఉద్యోగం పోతే ఈఎంఐ రద్దు
11 అంకెల సెల్ ఫోన్ నెంబర్లు రాబోతున్నాయి
కరోనా కన్నా రాక్షసం ఈ మనుషులు..