ఏపీలో ఇవాళ ఒక్కరోజే 106 మరణాలు

ఏపీలో ఇవాళ ఒక్కరోజే 106 మరణాలు
  • చిత్తూరు జిల్లాలోనే 15 మంది మృతి
  • ఇవాళ 15 వేల 284 కొత్త కేసులు నమోదు

అమరావతి: ఏపీలో కరోనా మరణాల ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజు వందకుపైగా మరణాలు నమోదవుతుండగా.. ఇవాళ కూడా 106 మరణాలు నమోదయ్యాయి. గడచిన 24గంటల్లో 72 వేల 979 మందికి పరీక్షలు చేయగా 15 వేల 284 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో గడచిన 24 గంటల్లో 106 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇందులో ఒక్క చిత్తూరు జిల్లాలోనే 15 మంది ఉండడం గమనార్హం. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది, అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖపట్టణం జిల్లాల్లో 9మంది చొప్పున, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 8 మంది చొప్పున, శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కడప జిల్లాలో ఒకరు కరోనాతో మృతి చెందారు. అలాగే గడచిన24 గంటల్లో 20 వేల 917 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆస్పత్రుల నుండి డిశ్చార్జి అయినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల వారీగా గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.