బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ స్టూడెంట్ సూసైడ్.. ఇబ్రహీంపట్నం ఎంబీఆర్ నగర్లో ఘటన

బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ స్టూడెంట్ సూసైడ్.. ఇబ్రహీంపట్నం  ఎంబీఆర్ నగర్లో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు : బిల్డింగ్​పై నుంచి దూకి ఓ బీటెక్​ స్టూడెంట్​ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్​జిల్లా కురవి మండలం రాజోలుకు చెందిన విట్టల వాసుదేవ్(20) ఇబ్రహీంపట్నంలోని సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ (సీఎస్సీ) సెకండ్​ఇయర్​చదువుతున్నాడు. ఎంబీఆర్​నగర్‌‌‌‌లో ఫ్రెండ్స్​తో కలిసి ఉంటున్నాడు. గురువారం రాత్రి తానుండే బిల్డంగ్​మూడో అంతస్తు పైకి ఎక్కి దూకాడు. తీవ్రంగా గాయపడడంతో దవాఖానకు తరలిస్తుండగా కన్నుమూశాడు. కారణాలు ఏమిటనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు.