పర్వతగిరి: ఫ్రెండ్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం

పర్వతగిరి: ఫ్రెండ్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం

పర్వతగిరి, వెలుగు: వరంగల్​ జిల్లా పర్వతగిరి పట్టణ కేంద్రానికి చెందిన విశ్వజెనిత్​స్కూల్​ కరస్పాండెంట్​ ఎర్రబెల్లి హరికుమార్​ ఈనెల 7న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతనితో కలిసి 1999-–2000లో టెన్త్‌‌‌‌‌‌‌‌ చదువుకున్న ఫ్రెండ్స్ అండగా నిలిచారు. అతని కుమార్తె ఆధ్యశ్రీ భవిష్యత్‌‌‌‌‌‌‌‌ కోసం పోస్టల్ అకౌంట్‌‌‌‌‌‌‌‌లో రూ. లక్ష ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్ డిపాజిట్ చేశారు. 

ఆ డిపాజిట్ పత్రాలను  గురువారం హరికుమార్​ దశదినకర్మ వేడుకలకు హాజరై  కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం బాధిత కుటుంబసభ్యులను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌‌‌‌‌‌‌‌రెడ్డి పరామర్శించారు.