దేశంలో లక్షకు చేరువైన కరోనా మరణాలు

దేశంలో లక్షకు చేరువైన కరోనా మరణాలు

దేశంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 81,484 కొత్త కేసులు నమోదవ్వగా 1095 మంది చనిపోయారు. వీటితో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 63,94,069 కు చేరగా..మరణాల సంఖ్య 99,773 కు చేరింది. నిన్న ఒక్కరోజే 78,877 మంది కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య దేశంలో 53,52,078కు చేరింది. ఇంకా 9,42,217 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని  కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. నిన్న 10,97,947 శాంపిల్స్ టెస్టు చేయడంతో అక్టోబర్ 1 నాటికి దేశంలో కరోనా టెస్టులు 7 కోట్ల 67 లక్షల 17 వేల 728 కు చేరాయని ఐసీఎంఆర్ ప్రకటించింది.

ప్రెసిడెంట్, పీఎంకు వాడే స్పెషల్ ఫ్లైట్స్ ఇవే..