లక్షా 43 వేలు దాటిన కరోనా మరణాలు

లక్షా 43 వేలు దాటిన కరోనా మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో  కొత్తగా 30 వేల 254 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 98లక్షల 57 వేల 29 కి చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 391 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య లక్షా 43 వేల 19 కి  చేరింది. నిన్న మరో 33  వేల  136 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకూ 93 లక్ష57 వేల 464  మంది కరోనా నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో  3 లక్షల 56 వేల 546 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 10లక్షల ,14 వేల 434  టెస్టులు చేశారు. దీంతో డిసెంబర్ 12 వరకు దేశంలో కరోనా టెస్టుల సంఖ్య  మొత్తం 15 కోట్ల 37 లక్షల 11 వేల 833 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది..