అనాధ విద్యార్థి గృహంలో 45మందికి కరోనా

అనాధ విద్యార్థి గృహంలో 45మందికి కరోనా

హైదరాబాద్: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఎల్బీనగర్ లోని చిత్ర లే అవుట్ లో ఉన్న అనాధ విద్యార్థి గృహంలో 45 మంది విద్యార్థులకు కరోనా సోకింది. హాస్టల్ లో ఉంటున్న మొత్తం 100 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 45 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైద్య సిబ్బంది వెంటనే అప్రమత్తమై పాజిట్ వచ్చిన వారిని వేరుగా ఉంచాలని సూచించారు. దీంతో హాస్టల్ నిర్వాహకులైన అధికారులు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గదుల్లోకి పాజిటివ్ వచ్చిన వారిని ఐసొలేషన్ లో ఉంచారు. నెగటివ్ వచ్చిన విద్యార్థులను ఫస్ట్ ప్లోర్ కు తరలించారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో కరోనా సోకడంతో హాస్టల్ కు వచ్చిపోయే పని సిబ్బందిని, ఇతరులను కూడా గుర్తించి పరీక్షలు జరుపుతున్నారు. ఈ విద్యార్థులు తిరిగిన ప్రదేశాల్లోని వారు కూడా అనుమానం వస్తే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రచారం చేస్తున్నారు. 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు.