హైదరాబాద్: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఎల్బీనగర్ లోని చిత్ర లే అవుట్ లో ఉన్న అనాధ విద్యార్థి గృహంలో 45 మంది విద్యార్థులకు కరోనా సోకింది. హాస్టల్ లో ఉంటున్న మొత్తం 100 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 45 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైద్య సిబ్బంది వెంటనే అప్రమత్తమై పాజిట్ వచ్చిన వారిని వేరుగా ఉంచాలని సూచించారు. దీంతో హాస్టల్ నిర్వాహకులైన అధికారులు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గదుల్లోకి పాజిటివ్ వచ్చిన వారిని ఐసొలేషన్ లో ఉంచారు. నెగటివ్ వచ్చిన విద్యార్థులను ఫస్ట్ ప్లోర్ కు తరలించారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో కరోనా సోకడంతో హాస్టల్ కు వచ్చిపోయే పని సిబ్బందిని, ఇతరులను కూడా గుర్తించి పరీక్షలు జరుపుతున్నారు. ఈ విద్యార్థులు తిరిగిన ప్రదేశాల్లోని వారు కూడా అనుమానం వస్తే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రచారం చేస్తున్నారు. 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు.
అనాధ విద్యార్థి గృహంలో 45మందికి కరోనా
- హైదరాబాద్
- April 5, 2021
లేటెస్ట్
- సెబీలో ఆఫీసర్ పోస్టులు
- కేసీఆర్వి పిల్లి శాపనార్థాలు : మంత్రి పొన్నం ప్రభాకర్
- రూ. 30 కోట్ల సింగరేణి నిధులు తెప్పించే బాధ్యత నాది : గడ్డం వంశీ కృష్ణ
- ఎడ్లబండిపై కలెక్టర్ ప్రచారం !
- ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీకి బీఆర్ఎస్ సర్కారే ఓకే చెప్పింది
- నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పీజీ
- పుంజుకున్న స్టాక్ మార్కెట్:సెన్సెక్స్ 599 పాయింట్లు అప్
- సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్.. అప్రమత్తమైన పోలీసులు
- అదృష్టంగా భావించను..బాధ్యతగా తీస్కుంట: గడ్డం వంశీ కృష్ణ
- ఇంటిగ్రేటెడ్ బీఈడీ అడ్మిషన్స్
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష