- ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్ పై కేసు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: నకిలీ రెమ్డిసివిర్ ఇంజక్షన్ వేయడంతో కరోనా పేషెంట్ఒకరు చనిపోయారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు, మృతుడి కొడుకు సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక గొల్లగూడెంకి చెందిన భద్రయ్య అనే వ్యక్తికి ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలింది. మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఐదు రోజుల క్రితం కుటుంబ సభ్యులు సిటీలోని బాలాజీ చెస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చికిత్సలో భాగంగా రెమ్డిసివిర్ ఇంజక్షన్లు చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పడంతో ఒక్కోదానికి రూ.30వేలు కట్టేటట్లు మాట్లాడుకున్నారు. మొత్తం ఆరు ఇంజక్షన్లు వేస్తామని చెప్పి మొదట రెండు వేశారు. కాగా భద్రయ్య బుధవారం మృతి చెందారు. నకిలీ రెమ్డిసివిర్ ఇంజక్షన్ చేయడంతోనే చనిపోయాడంటూ అతని కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్కు కంప్లైంట్ చేశారు. స్పందించిన కలెక్టర్విచారణ చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్అధికారులను ఆదేశించారు. నకిలీ రెమ్డిసివిర్ఇచ్చినట్టు అధికారులు దర్యాప్తులో గుర్తించారు. దీనిపై హెల్త్డిపార్ట్మెంట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్ యాజమాన్యంపై కేసు ఫైల్ చేశారు.