భారత్ లో 69 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో 69 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా ఉదృతి కొనసాగుతుంది. కరోనా కేసులు 69 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 70,496 కేసులు నమోదవడంతో ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 69 లక్షల 6 వేల152 కు  చేరింది.964 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 1,06,490 కు చేరింది. నిన్న ఒక్కరోజే 78,365 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య దేశంలో 59,06,070కు చేరింది. ఇంకా 8,93,592 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.దేశంలో కరోనా మరణాల రేటు 1.54 ఉండగా..రికవరీ 85.52 శాతంగా ఉంది.