దేశంలో 87 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో 87 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు 87 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 44,878 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసులు 87,28,795 కు చేరాయి.మరో 547 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య1,28,688 కి చేరింది. నిన్న ఒక్కరోజే49079 మంది కోలుకున్నారు. మొత్తం నిన్నటి వరకు దేశ వ్యాప్తంగా 81,15,580 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 4,84,547 మంది ఆస్పత్రిలో ఉన్నారు. దేశంలో కరోనా ఆక్టివ్ కేసుల శాతం 5.55, రికవరీ శాతం 92.97 గా ఉండగా.మరణాల రేటు 1.47 శాతంగా ఉన్నాయి.