జగిత్యాల గురుకుల స్కూల్ లో 9 మంది విద్యార్థులకు కరోనా

జగిత్యాల గురుకుల స్కూల్ లో 9 మంది విద్యార్థులకు కరోనా

జగిత్యాల జిల్లాలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. మల్యాల మండలం తాటిపెళ్లి గురుకుల స్కూల్ లో తొమ్మిది మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్ లో ఓ ప్రైవేటు స్కూల్ లో ఏడో తరగతి విద్యార్థికి కరోనా సోకింది. దీంతో కరోనా వచ్చిన విద్యార్థుల తరగతులు బంద్ పెట్టారు స్కూల్ నిర్వాహకులు. మిగతా తరగతులను నిర్వహిస్తున్నారు. ఒకే స్కూల్ లో 9మంది పిల్లలకు కరోనా రావడంపై.. మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే తరగతి గదులను ఎప్పటికప్పుడు సానిటైజ్ చేస్తున్నామని చెబుతున్నారు స్కూల్ నిర్వాహకులు. మిగతా విద్యార్థులకు కరోనా టెస్టులు చేస్తున్నారు.