మేడారంలో దేవాదాయ ఉద్యోగులకు కరోనా

మేడారంలో దేవాదాయ ఉద్యోగులకు కరోనా

మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతరలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు దేవాదాయశాఖ ఉద్యోగులకు కరోనా సోకింది. ఇద్దరికీ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారి అప్పయ్య తెలిపారు. ఈ నెల 24న మొదలైన మేడారం మినీ జాతర ఈ రోజు(శనివారం)తో ముగిసింది. గత నాలుగు రోజులుగా ఉద్యోగులు ఇద్దరూ విధుల్లో ఉన్నారు. ఆలయంలో విధులు నిర్వహిస్తూ భక్తులకు సేవలందించే క్రమంలో ఉద్యోగులిద్దరూ అస్వస్థకు లోనయ్యారు. దీంతో వీరిద్దరికీ స్థానిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. ఉద్యోగులను హోం క్వారంటైన్‌కు తరలించినట్లు తెలిపారు వైద్యాధికారి అప్పయ్య.