ఐజీ స్టీఫెన్ రవీంద్రకు కరోనా పాజిటివ్

ఐజీ స్టీఫెన్ రవీంద్రకు కరోనా పాజిటివ్

హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర కరోనా బారినపడ్డారు. స్టీఫెన్ రవీంద్ర సోమవారం కరోనా టెస్టు చేయించుకోగా, ఇవాళ( మంగళవారం)పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ల సూచనతో ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు.

స్టీఫెన్ రవీంద్రకు కరోనా పాజిటివ్ అని తెలియడంతో ఆయనను గతం వారం రోజుల్లో కలిసినవారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. స్టీఫెన్ రవీంద్ర గతంలో YSR సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా వ్యవహరించారు.