అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్

అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి కరోనా సోకింది. వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈఎస్ఐ కేసులో ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన గుంటూరులోని రమేశ్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. ESI  కుంభ కోణం ఆరోపణల్లో పోలీసులు అచ్చెన్నాయుడిని చేయగా… అనారోగ్యం కారణంగా గత కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన నిన్న(బుధవారం) ఉదయం నుంచి జలుబుతో బాధపడుతుండటంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అచ్చెన్నాయుడి ఆరోగ్యం బాగానే ఉందని రమేశ్ ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు.

ప్రస్తుతం ప్రతివారం అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై హైకోర్టుకు ఆస్పత్రి నివేదిక ఇస్తోంది. ఈ క్రమంలో.. అచ్చెన్నకు కరోనా సోకడంపై హైకోర్టుకు లేఖ రాయనున్నారు. మరోవైపు అచ్చెన్నాయుడికి కరోనా సోకిందని తెలియడంతో ఆయన కుటుంబసభ్యులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.