విజయవాడ: ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. సామాన్యులు మొదలు వీవీఐపీల వరకు వారు వీరు అని తేడా లేకుండా అందరికీ సోకుతోంది.ఎంతో జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలకు కరోనా సోకగా…తాజాగా శాసన మండలి చైర్మన్ అహమ్మద్ షరీఫ్కు కరోనా సోకింది. శాంపిల్స్ తీసి చెక్ చేయగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. షరీఫ్ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రెండు తెలుగు రాష్ట్రాల టీడీపీ నేతలు ఆకాంక్షించారు.