
హైదరాబాద్: ఒకే పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న నలుగురు ఎస్.ఐలతోపాటు.. మరో ముగ్గురు సిబ్బందికి రెండో సారి కరోనా సోకింది. ఎస్ అర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. స్టేషన్ లో పనిచేస్తున్న నలుగురు ఎస్ ఐ లు, ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్, ఒక రైటర్ కు రెండోసారి కోవిడ్ నిర్ధారణ కావడంతో కలకలం రేపుతోంది. గత జూన్ నెలలో కరోనా సోకిన వారికి ఇప్పుడు రెండోసారి పాజిటివ్ రావడం గుబులు పుట్టిస్తోంది. ఎస్ ఆర్ నగర్ పోలీసు స్టేషన్ సిబ్బంది భయాందోళనలకు లోనవుతున్నారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కలకలం సృష్టిస్తోంది.