తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చన్నారు మంత్రి  ఈటల రాజేందర్ . ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్ లో ప్రివెంటివ్ హెల్త్ కేర్ అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్-2020 పేరుతో ‘సేఫ్ రీఓపెనింగ్ ఆఫ్ స్కూల్స్’ అంశంపై జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి రోజు 50 వేల మందికి కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో స్కూళ్లను ప్రారంభించడానికి ప్రైవేట్ యాజమాన్యాలన్నీ సిద్ధంగా ఉన్నాయని… ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ట్రస్మా ప్రతినిధులు కోరారని చెప్పారు మంత్రి ఈటల. దీనికి సమాధానంగా అందరూ కలసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలని వారికి సూచించారు. స్కూళ్లను ప్రారంభించే విషయంలో సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అవసరమైతే స్కూళ్లలో కూడా కరోనా పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు మంత్రి ఈటల.