
యునైటెడ్ నేషన్స్: కరోనా సెకండ్ వేవ్ తో ఇండియాలో పరిస్థితి విషాదకరగా మారిందని యునిసెఫ్ ఈడీ హెన్రీటా ఫోర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇండియా పరిస్థితి అన్ని దేశాలకూ వార్నింగ్ బెల్స్ గా భావించాలన్నారు. వెంటనే ఇండియాకు అన్నిరకాలుగా సాయం చేయాలని, లేకుంటే ప్రపంచ దేశాల న్నింటికీ తీవ్ర నష్టం తప్పదన్నారు. వైరస్ మ్యుటేషన్లు పెరిగి, కేసులు, డెత్స్ ఎక్కువవుతాయని, అనేక రకాల వస్తువుల సరఫరా చైన్కు ఆటంకం కలుగుతుందన్నారు. యునిసెఫ్ తరఫున ఇండియాకు 20 లక్షల ఫేస్ షీల్డులు, 2 లక్షల సర్జికల్ మాస్కులు పంపామని తెలిపారు. కరోనా కారణంగా అత్యవసర హెల్త్ సర్వీసులు అందడం కష్టంగా మారిం దని, ఫస్ట్ వేవ్లో ఒక్క సౌత్ ఏసియా లోనే 2.28 లక్షల పిల్లలు, 11 వేల తల్లులు రకరకాల ట్రీట్ మెంట్లు అందక చనిపోయారని యునిసెఫ్ సౌత్ ఏసియా రీజినల్ డైరెక్టర్ లార్యే అడ్జేయి వెల్లడించారు.