
జనగామాకు చెందిన వ్యక్తికి కరోనా ఉందంటే అనుమానిస్తున్నారు వైద్యులు. అయితే టెస్ట్ లు చేసేందుకు సదరు వ్యక్తి ఒప్పుకోకపోవడంతో పాటు హాస్పిటల్ నుంచి పారిపోయాడు. జనగామ జిల్లా లింగాల ఘనపురానికి చెందిన ఓ వ్యక్తి రెండు రోజుల క్రింద దుబాయ్ నుంచి వచ్చాడు. అయితే వచ్చినప్పటినుంచి దగ్గు, జ్వరం, సర్దితో బాధపడుతుండగా నిన్నటి వరకు ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నాడు. అది తగ్గకపోవడంతో శుక్రవారం గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లగా అక్కడి డాక్టర్ రఘు పూజారి అతన్ని పరిశీలించి కరోనా ఉందని అనుమానించాడు. దీంతో పాటు కరోనా టెస్ట్ చేయించుకోవాలని కోరాడు. దీంతో డాక్టర్ కు చెప్పకుండానే… సదరు వ్యాదిగ్రస్తుడు హాస్పిటల్ నుంచి పరారయ్యాడు. డాక్టర్ రఘు మాత్రం పరీక్షలు చేయించుకోవాలని ఫోన్ లో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు.