భారత్ లో 9వేలు దాటిన కేసులు

భారత్ లో 9వేలు దాటిన కేసులు

దేశంలో ఆదివారం కొత్తగా 753 నమోదు
మరో 42 మంది మృతి.. 331కి చేరిన మరణాలు
మొత్తం 364 జిల్లాలకు పాకిన కరోనా వైరస్
ఎక్కువగా యూపీ, తమిళనాడు, మహారాష్ట్రలో ఎఫెక్ట్

న్యూఢిల్లీ: దేశవ్యా ప్తంగా కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే 753 మందికి పైగా పాజిటివ్ వచ్చింది. 42 మంది మరణించారు. మొత్తం కేసులు 9,205కు చేరగా.. మృతుల సంఖ్య 331కి పెరిగింది. మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, ఢిల్లీల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఆదివారం నాటి కేసుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లోనే 516 ఉండటం గమనార్హం. ఈ ఒక్కరోజు చనిపోయినవారిలో ఒక్క మహారాష్ట్రకు చెందినవారే 22 మంది. దేశవ్యాప్తంగా వైరస్ బారినపడ్డవారిలో ఇప్పటి వరకు 1 ,080 మంది కోలుకున్నారు.