కరోనా వైరస్ సోకిన వారు లక్షల్లో ఉండవచ్చు: అంతర్జాతీయ వైద్యులు

కరోనా వైరస్ సోకిన వారు లక్షల్లో ఉండవచ్చు: అంతర్జాతీయ వైద్యులు

చైనాలో 25వేల మందికి కరోనా వైరస్
500మంది చనిపోగా.. మరో 500మంది సీరియస్
కరోనా వైరస్ సోకిన వారు లక్షల్లో ఉండవచ్చు: అంతర్జాతీయ వైద్య నిపుణులు

చైనాను వణికిస్తున్న కరోనా వైరస్.. మరో 26 దేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 500కు చేరింది. ఇందులో చైనాలో చనిపోయిన వారే 492 మంది ఉన్నారు. చైనాలో ఇప్పటివరకు 24 వేల మందికి పైగా వైరస్ సోకిందని నిర్ధారించారు. వీరిలో 5 వందల మంది పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు.  వైరస్ సోకిన వారితో సన్నిహితంగా ఉన్న మరో లక్షా 71 వేల మందిని అబ్జర్వేషన్ లో ఉంచారు చైనా అధికారులు. కరోనా వైరస్ సోకిన వారు లక్షల్లో ఉండవచ్చని అంతర్జాతీయ వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అప్పుడే పుట్టిన చిన్నారికి వైరస్ సోకినట్టు గుర్తించారు. డెలివరీకి ముందు ఆమె తల్లికి కరోనా ఉన్నట్టు తేల్చారు నిపుణులు.

బీజింగ్ లోనూ రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు వుహాన్ లో వెయ్యి పడకల హాస్పిటల్ ను 10 రోజుల్లో నిర్మించిన చైనా సర్కార్… తాజాగా 13 వందల పడకలున్న మరో హాస్పిటల్ ను నిర్మిస్తోంది. కరోనా వైరస్ తో చైనా సరిహద్దు దేశాలు అలర్టయ్యాయి. నార్త్ కొరియా, రష్యా, మంగోలియా దేశాలు చైనాతో తమ బార్డర్ ను క్లోజ్ చేశాయి. 12 నగరాలు కరోనా వైరస్ భారిన పడటంతో.. ఆ ప్రాంతాలకు ట్రావెల్ బ్యాన్ విధించింది చైనా.