కరోనా వైరస్‌కూ బతికే హక్కుంది

కరోనా వైరస్‌కూ బతికే హక్కుంది

డెహ్రాడూన్: దేశంలో కరోనా వైరస్ రెండో వేవ్లో విజృంభిస్తోంది. ఈ సమయంలో మహమ్మారి గురించి ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్కు కూడా జీవించే హక్కు ఉందని రావత్ అన్నారు. 'ఫిలాసఫికల్‌గా చూస్తే కరోనా కూడా బతికున్న ఓ జీవమే. మనలాగే దానికీ బతికే హక్కు ఉంది. కానీ మనుషులమైన మనం మాత్రం మనమే తెలివైన వారమని భావిస్తాం. అలాంటి జీవాలను బతకనీయకుండా చేస్తాం. అందుకే ఆ వైరస్ నిత్యం తనను తాను మార్చుకుంటూ మ్యూటేట్ అవుతోంది' అని రావత్ పేర్కొన్నారు. మనుషులు తాము మనుగడ సాగించేందుకు వైరస్‌ను తుదముట్టించెందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ఇప్పుడీ మాటలపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.