షెడ్యూల్ ప్రకారమే కార్పొరేషన్,మున్సిపాలిటీల ఎన్నికలు

షెడ్యూల్ ప్రకారమే కార్పొరేషన్,మున్సిపాలిటీల ఎన్నికలు

తెలంగాణ‌లోని 2 కార్పొరేష‌న్, 5మున్సిపాలిటీలకు షెడ్యూల్ ప్ర‌కార‌మే ఈ నెల 30వ తేదీన ఎన్నిక‌ల నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. క‌రోనా సెకండ్ వేవ్ ఉదృతి దృష్ట్యా ఇప్ప‌టికే రాష్ట్రంలో రాత్రి పూట క‌ర్ఫ్యూ అమ‌లు అవుతోంది. అదే విధంగా ప్ర‌జ‌ల క‌ద‌లిక‌ల‌పై ఆంక్ష‌లు విధించారు. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ప్ర‌జ‌ల‌ను ఇళ్ల నుంచి ప్ర‌జ‌ల‌ను బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని ప్ర‌భుత్వం హెచ్చరించింది. స‌భ‌లు,స‌మావేశాలు,జనం గుంపులుగా ఉండటంపై క‌ఠిన‌ ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. ఈ ద‌శ‌లో ఎన్నిక‌ల జ‌రిగే ప్రాంతాల‌లో ప్ర‌చారానికి ఆటంకాలు ఎదుర‌వుతున్నాయి. ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌ల‌ను నిలుపుద‌ల చేయాల‌ని కోరుతూ హైకోర్టులో కాంగ్రెస్ వేసిన పిల్ పై తీర్పు ఇస్తూ తామ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో జోక్యం చేసుకోలేమ‌ని తేల్చి చెప్పింది. అయితే ఈ విష‌యంలో పిటిష‌న‌ర్ ఎన్నిక‌ల క‌మిష‌న్ ను ఆశ్ర‌యించ‌వ‌చ్చ‌ని కోరింది. ఈ క్రమంలో ప‌లు పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను నిలుపుద‌ల చేయాల‌ని కోరుతూ ఎన్నిక‌ల క‌మిష‌న్ ను కోరాయి. వాటిని ప‌రిశీలించిన ఎన్నిక‌ల క‌మిష‌న్ ఎన్నిక‌ల నిలుపుద‌ల పై ప్ర‌భుత్వ అభిప్రాయాన్ని కోరుతూ సిఎస్ కు లేఖ రాసింది.. దీనిపై నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌భుత్వం యథావిధిగానే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ను కోరింది. కరోనా  నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ప్ర‌చారాన్ని నిర్వ‌హించాల‌ని అన్ని పార్టీల‌కు ఎన్నిక‌ల సంఘం సూచించింది. అలాగే ప్ర‌చారంలో అయిదుగురు మించి పాల్గొన‌కూడ‌ద‌ని ఆంక్ష‌లు విధించింది.. సాయంత్రం ఆరు గంట‌ల‌కే ప్ర‌చారాల‌ను ముగించాల‌ని కోరింది. బ‌హిరంగ స‌భ‌లు, రోడ్లపై ప్ర‌చారాలు నిషేధించింది.

అయితే.. ఇప్ప‌టికే ప్రారంభ‌మైన ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో రేప‌టి(బుధవారం)తో నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గడువు ముగియ‌నుంది. ఈ నెల 30వ తేదిన పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మే మూడో తేదిన కౌంటింగ్ నిర్వహించి.. అదే రోజు ఫ‌లితాల‌ను ప్ర‌క‌టిస్తారు.