- పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
మాదాపూర్, వెలుగు : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్పేట, మాదాపూర్ డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు వి.పూజిత, జగదీశ్వర్ గౌడ్ దంపతులు కాంగ్రెస్లో చేరారు. వీరికి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంగళవారం కార్పొరేటర్ దంపతులు పూజిత, జగదీశ్వర్ గౌడ్ నియోజకవర్గ లీడర్లతో కలిసి జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి టెంపుల్కు వెళ్లారు.
అక్కడ ప్రత్యేక పూజలు చేసి ర్యాలీగా జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో ఇద్దరు కాంగ్రెస్లో చేరారు. జగదీశ్వర్ గౌడ్ చేరికతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ మరింత బలోపేతం అయిందని, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.