ఇలా వచ్చి.. అలా క్యాంప్​ చేంజ్

ఇలా వచ్చి.. అలా క్యాంప్​ చేంజ్
  • ఏపీ నుంచి వచ్చి హైదరాబాద్‌‌‌‌కు తరలిన 16 మంది కౌన్సిలర్లు
  • 27న కలెక్టర్​ను కలవనున్న భువనగిరి, ఆలేరు కౌన్సిలర్లు

యాదాద్రి, వెలుగు :  భువనగిరి మున్సిపల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌, వైస్ చైర్మన్‌‌‌‌పై అవిశ్వాసం రోజుకో మలుపు తిరుగుతోంది. ఏపీకి వెళ్లిన బీఆర్ఎస్​ అసంతృప్త కౌన్సిలర్లు క్యాంప్​చేంజ్​ చేశారు. ఏపీ నుంచి వచ్చినట్టే వచ్చి వెంటనే హైదరాబాద్‌‌‌‌కు తరలివెళ్లారు.  20 మంది బీఆర్ఎస్​కు చెందిన 20 మంది కౌన్సిలర్లలో 16 మంది అసంతృప్త జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో 11 మంది కౌన్సిల్‌‌‌‌కు రాకుండా ఈ నెల 21న టూర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లారు.  నాలుగు రోజులుగా ఏపీలోని వివిధ ప్రాంతాల్లో తిరిగిన వీరు సోమవారం భువనగిరికి చేరుకున్నారు. ఆ వెంటనే స్థానికంగా ఓ బీఆర్​ఎస్​ కౌన్సిలర్ ఇంట్లో భేటీ అయ్యారు.

 కౌన్సిలర్లు అందరూ ఏకతాటిపై ఉండాలని, చైర్మన్, వైస్​చైర్మన్​పై మరోసారి అవిశ్వాస నోటీసు ఇవ్వాలని తీర్మానం చేసుకున్నట్టు తెలిసింది. మంగళవారం సెలవు రోజు కాబట్టి ఈ నెల 27న (బుధవారం) కలెక్టర్‌‌‌‌‌‌‌‌ను కలువనున్నట్లు సమాచారం. స్థానికంగా ఉంటే బీఆర్ఎస్​ పెద్ద లీడర్ల నుంచి ఒత్తిడి వస్తుందన్న ఉద్దేశంతో ఈసారి మరో ఐదుగురిని కలుపుకొని హైదరాబాద్‌‌‌‌కు వేర్వేరు వాహనాల్లో వెళ్లినట్టు తెలిసింది. ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న బీజేపీ  చైర్మన్​ పదవి కాంగ్రెస్​కు దక్కకుండా చేయాలని ప్లాన్​ చేస్తోంది.   

27న కలెక్టర్ వద్దకు.. 

క్యాంపుకు వెళ్లిన  కౌన్సిలర్లు బుధవారం తిరిగి భువనగిరి రానున్నారు. అదే రోజు కలెక్టర్​ హనుమంతు జెండగేను కలిసి నోటీసు మరోసారి ఇస్తారని సమాచారం. ఇటు ఆలేరు మున్సిపాలిటీలోని 12 మంది కౌన్సిలర్లలో కాంగ్రెస్​, బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లతో పాటు బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు 10 మంది ఒక్కటయ్యారని తెలిసింది. తాము కూడా బుధవారం కలెక్టర్‌‌‌‌‌‌‌‌ను మరోసారి కలుస్తామని ఓ కౌన్సిలర్​ తెలిపారు. అవసరమైతే మరోసారి అవిశ్వాసం నోటీసు ఇస్తామని చెప్పారు.