నేను స్థలాన్ని కబ్జా చేయలేదు : కౌన్సిలర్ బ్రహ్మం

నేను స్థలాన్ని కబ్జా చేయలేదు : కౌన్సిలర్ బ్రహ్మం
  •     సొంత డబ్బులతో కొనుగోలు చేశా

సిద్దిపేట టౌన్, వెలుగు: సిద్దిపేట పట్టణంలో కొంత స్థలాన్ని కబ్జా చేశానని తనపై వస్తున్న ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని కౌన్సిలర్ బ్రహ్మం వివరణ ఇచ్చారు. శుక్రవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పట్టణ పరిధిలోని 1640 సర్వే నంబర్ లో  మొత్తం 2 ఏకరాల 11 గుంటలు ఉండగా అందులో 1 ఏకరం 5 గుంటలు మాత్రమే నదిమొద్దిన్ దగ్గర నుంచి  కొనుగోలు చేశానన్నారు. వీటికి సంబంధించిన ఆధారాలను చూపించారు. కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ స్థలాన్ని ప్లాట్లుగా చేసి అమాయకులకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ  సంఘటన పై న్యాయస్థానం లో ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నామని తెలియజేశారు. నిజాలు తెలుసుకోకుండా తనపై అసత్య ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించి తనతో పాటు ప్లాట్లు కొన్న వారికి న్యాయం చేయాలన్నారు.