ఇటీవల పలువురు యువత పబ్లిక్గా చేస్తున్న పిచ్చి పనులు చూస్తుంటే.. ఇదేందయ్యా ఇదీ.. అనక మానరు. ఇనాళ్లు పడక గదికే పరిమితమనుకున్న రొమాన్స్ని పలువురు బస్సుల్లో, ఆటోల్లో చేసిన వీడియోలను సోషల్ మీడియాలో చూశాం. కొందరు మరీ శృతి మించి మెట్రోల్లో పట్టపగలే పబ్లిక్గా రొమాన్స్చేసుకోవడం ఇటీవల వైరల్అయ్యాయి. అయినా మాకేం పట్టదన్నట్టు ఉంటున్నారు ఇంకొందరు. ఇప్పుడు ఒక మెట్టు పైకి ఎక్కేసి ఏకంగా బైక్పై రొమాన్స్ చేసుకోవడం చూసే వారిని విస్మయానికి గురి చేస్తోంది. హవ్వా... పబ్లిక్ గా ఇవేం పాడు పనులు అంటూ ముక్కున వేలేసుకుని కళ్లు మూసుకుని పోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ బైక్రొమాన్స్ ఘటన ఉత్తర్ ప్రదేశ్లో జరిగింది. సంబంధిత వీడియోను ఓ యూసర్పోలీసులకు ట్యాగ్చేస్తూ ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరాడు.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఘాజియాబాద్లోని ఇందిరాపురం సమీపంలోని జాతీయ రహదారి 9 పై ఇద్దరు ప్రేమికులు బైక్పై వెళ్తున్నారు. అందులో తప్పేముంది.. అనుకుంటున్నారా. నిజమే అమ్మాయి వెనక కూర్చుని ఉంటే తప్పు లేదు. కానీ ఆమె బైక్ముందు కూర్చుని అబ్బాయిని కౌగిలించుకుని ఉంది. ఇంక ముద్దు ముచ్చట.. అబ్బో.. నోటితో చెప్పే మాటలేనా అవి.. ఇలాంటివి పబ్లిక్ గా చేయడమేంటి అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రాజస్థాన్, ఛత్తీస్ఘడ్ లో ఇలాంటి ఘటనలే జరిగాయి. వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు.