మీరేంటో.. మీ అల‌వాట్లు ఏంటో.. బైక్ పై డేంజ‌ర‌స్ రొమాన్స్ చేస్తూ రైడింగ్

మీరేంటో.. మీ అల‌వాట్లు ఏంటో.. బైక్ పై డేంజ‌ర‌స్ రొమాన్స్ చేస్తూ రైడింగ్

ఇటీవల పలువురు యువత పబ్లిక్​గా చేస్తున్న పిచ్చి పనులు చూస్తుంటే..  ఇదేందయ్యా ఇదీ.. అనక మానరు. ఇనాళ్లు పడక గదికే పరిమితమనుకున్న రొమాన్స్​ని పలువురు బస్సుల్లో, ఆటోల్లో చేసిన వీడియోలను సోషల్​ మీడియాలో చూశాం. కొందరు మరీ శృతి మించి మెట్రోల్లో పట్టపగలే పబ్లిక్​గా రొమాన్స్​చేసుకోవడం ఇటీవల వైరల్​అయ్యాయి. అయినా మాకేం పట్టదన్నట్టు ఉంటున్నారు ఇంకొందరు. ఇప్పుడు ఒక మెట్టు పైకి ఎక్కేసి ఏకంగా బైక్​పై రొమాన్స్ చేసుకోవడం చూసే వారిని విస్మయానికి గురి చేస్తోంది. హవ్వా... పబ్లిక్ గా ఇవేం పాడు పనులు అంటూ ముక్కున వేలేసుకుని కళ్లు మూసుకుని పోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ బైక్​రొమాన్స్ ఘటన ఉత్తర్ ప్రదేశ్​లో జరిగింది. సంబంధిత వీడియోను ఓ యూసర్​పోలీసులకు ట్యాగ్​చేస్తూ ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరాడు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఘాజియాబాద్​లోని ఇందిరాపురం సమీపంలోని జాతీయ రహదారి 9 పై ఇద్దరు ప్రేమికులు బైక్​పై వెళ్తున్నారు. అందులో తప్పేముంది.. అనుకుంటున్నారా. నిజమే అమ్మాయి వెనక కూర్చుని ఉంటే తప్పు లేదు. కానీ ఆమె బైక్​ముందు కూర్చుని అబ్బాయిని కౌగిలించుకుని ఉంది. ఇంక ముద్దు ముచ్చట.. అబ్బో.. నోటితో చెప్పే మాటలేనా అవి.. ఇలాంటివి పబ్లిక్ గా చేయడమేంటి అని సోషల్​ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రాజస్థాన్, ఛత్తీస్​ఘడ్ లో ఇలాంటి ఘటనలే జరిగాయి. వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పబ్లిక్ డిమాండ్​ చేస్తున్నారు.