అమరావతి: ఏపీ సచివాలయం వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి దంపతుల ఆత్మహత్యాయత్నం చేశారు. తమ పొలాన్ని ఆన్ లైన్ చేసేందుకు తాహశీల్దార్ కోటి రూపాయలు తీసుకుని కూడా చేయడం లేదంటూ పెట్రోల్ డబ్బాలతో వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా దుత్తలూరు ఎమ్మార్వో చంద్రశేఖర్ తమ వద్ద కోటి రూపాయలు తీసుకుని మోసం చేశాడని బాధితులు చెబుతున్నారు. చిట్టమూరు మండలం చిలమూరులో ఉన్న తమ పొలం ఆన్లైన్ చేస్తానని చెప్పి డబ్బులు తీసుకుని కూడా చేయక పోవడంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్యాయత్నం చేశామని వాపోతున్నారు బాధితులు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పట్టపగలు అందరూ సందర్శకులు వచ్చే వేళలో దంపతుల ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం సృష్టించింది.
For More News..
క్లాస్ రూమ్లో లేడీ టీచర్ పై కత్తితో దాడి
కశ్మీరీల డిమాండ్లను భారత్ నెరవేర్చాలి