పెళ్లికి వచ్చే అతిథులకు విమానాన్ని బుక్ చేసిన జైసల్మేర్ లోని ఓ జంట

పెళ్లికి వచ్చే అతిథులకు విమానాన్ని బుక్ చేసిన జైసల్మేర్ లోని ఓ జంట

భారతీయులలో చాలా మంది తమ వివాహాలను అత్యంత ఆడంబరంగా చేసుకోవడానికి ఇష్టపడతారు. కరోనా నేపథ్యంలో దాదాపు 2సంవత్సరాలు సంబరాలు, వేడుకలకు దూరంగా ఉన్న జనం.. ఇప్పుడు ఏ చిన్న సంబరాన్నైనా వైభవంగా జరుపుకుంటున్నారు. అందులో ప్రత్యేకించి పెళ్లి విషయానికొస్తే.. వెరైటీ స్టైల్లో సెలబ్రేట్ చేసుకుంటూ ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. అయితే ఈ వివాహ కోసం ఇండియన్స్ ఎంత ఖర్చైనా పెడతారనడానికి ఉదాహరణే రాజస్థాన్ లోని జైసల్మేర్ లో జరిగిన సంఘటన. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్న  ఓ జంట వినూత్నంగా ఆలోచించింది. పలు ప్రాంతాల నుంచి వచ్చే తమ బంధువులు, స్నేహితులకు కలిపి ఏకంగా ఓ విమానాన్నే బుక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో పెళ్లికి వెళుతున్న వారంతా తమ సీట్లలో కూర్చొని, కేరింతలు కొడుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియోను శ్రేయ సాహ్ అనే వ్యక్తి షేర్ చేయగా.. ఇప్పటివరకు ఈ వీడియోకు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తూ, భిన్నమైన కామెంట్లను జోడిస్తున్నారు.