దంపతుల దారుణ హత్య..భర్తను కొట్టి భార్యను ఉరేసిన్రు

దంపతుల దారుణ హత్య..భర్తను కొట్టి భార్యను ఉరేసిన్రు

కామారెడ్డి: బీర్కూరు మండలం రైతు నగర్ లో దారుణం జరిగింది. అర్ధరాత్రి వేళ ఇంట్లో ఉన్న భార్యాభర్తలను గుర్తుతెలియని దుండగులు హత్య​చేశారు. రైతునగర్​కు చెందిన దారం నారాయణ గుప్తా (75) స్థానికంగా కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. నిన్న రాత్రి దంపతులు నిద్రిస్తుండగా..  దోపిడీ దొంగలు వెనుకనుంచి ఇంట్లోకి ప్రవేశించారు. బెడ్రూంలో ఉన్న నారాయణను ఆయుధంతో కొట్టి చంపారు. అనంతరం ఆయన భార్య సుశీల (65)ను చీరతో ఉరేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. క్లూస్‌టీంను రంగంలోకి దించి.. హత్యకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు.