పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న దంపతులు

పెట్రోల్  పోసుకుని నిప్పంటించుకున్న దంపతులు

జనగామ జిల్లాలో దారుణం జరిగింది.  జిల్లా కేంద్రంలో నీ వివర్స్ కాలనీలో కుటుంబ కలహాలతో  దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.  మార్చి 26  రాత్రి భర్యాభర్తలు ఇద్దరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

స్థానికుల సమాచారంతో  ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   మృతులు తమిళనాడుకు చెందిన సెల్వ రాజు భాగ్య లక్ష్మిగా గుర్తించారు.