రూ.8 లక్షల అప్పులు.. క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టలేక దంపతుల ఆత్మహత్య

రూ.8 లక్షల అప్పులు..   క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టలేక దంపతుల ఆత్మహత్య

కీసర, వెలుగు: మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎమ్ ఐలు కట్టలేక దంపతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..రాగుల సురేష్ కుమార్ (45), భాగ్య ( 40) భార్యాభర్తలు. ఆర్ ఎల్ నగర్ లో నివసిస్తున్నారు. వీరు క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎమ్ ఐలు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నారు. సురేష్ ఉరివేసుకోగా, అతడి భార్య భాగ్య పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. 

తమ పిల్లలను భాగ్య అమ్మగారి ఇంటికి పంపి మరీ దంపతులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అయితే, తల్లిదండ్రులు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో వారి పిల్లలు అనాధలుగా మిగిలిపోయారు.