
న్యూఢిల్లీ: కరోనా సీరియస్ డిసీజ్ కాదని, ఈ వైరస్ బారిన పడిన వారిలో 90 నుంచి 95 శాతం మంది కోలుకుంటున్నారని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. కరోనాను అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన గురువారం చెప్పారు. చాలా మంది పేషెంట్లు కరోనా లేదా ఫ్లూ సింప్టమ్స్ ఉన్నా హాస్పిటల్స్కు రావడం లేదని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే ట్రీట్మెంట్ అందించడంలో ఆలస్యం జరిగి మరణాల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మెజారిటీ కరోనా పేషెంట్లకు సపోర్టివ్ ట్రీట్మెంట్ సరిపోతోందని, 15 శాతం మందికి మాత్రమే ఆక్సిజన్ థెరపీ అవసరం అవుతోందని చెప్పారు. ఇప్పటికే మన దేశంలోని హాస్పిటల్స్లో కరోనా ట్రీట్మెంట్ కోసం వివిధ రకాల డ్రగ్స్, కొత్త వ్యాక్సిన్లు, మెడిసిన్లు వాడుతున్నారని, అలాగే కొంత మంది పేషెంట్లకు కన్వాల్సెంట్ ప్లాస్మా ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారని, ఇది మంచి రిజల్ట్స్ ఇస్తోందని డాక్టర్ గులేరియా చెప్పారు.