ఏపీలో ల‌క్ష‌దాటిన క‌రోనా కేసులు..గ‌డిచిన‌ 24 గంటల్లో 6,051 మందికి పాజిటీవ్

ఏపీలో ల‌క్ష‌దాటిన క‌రోనా కేసులు..గ‌డిచిన‌ 24 గంటల్లో 6,051 మందికి పాజిటీవ్

ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం ఉద‌యం 9 గంట‌ల నుంచి సోమ‌వారం ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 6,051 మందికి క‌రోనా సోకింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ల‌క్ష మార్కును దాటి 1,02,349కి చేరింది. మొత్తం కేసుల‌లో 49,558 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 51,701 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా సోకి రాష్ట్రంలో 1090మంది మ‌ర‌ణించారు. ఇక జిల్లాల వారీగా చూస్తే తూర్పుగోదావ‌రి జిల్లాలో అత్య‌ధికంగా 14,696 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. క‌ర్నూలు (12,234), గుంటూరు (10,747), అనంత‌పూర్ (10,247) ఆ త‌ర్వాత స్థానంలో ఉన్నాయి. ఇక మ‌ర‌ణాల విష‌యానికొస్తే.. క‌ర్నూలులో అత్య‌ధికంగా 164 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోగా.. కృష్ణా (149), తూర్పుగోదావ‌రి (129) ఆ త‌ర్వాత స్థానాల్లో ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు.